ATP: జిల్లాకు కేటాయించిన హౌసింగ్ లక్ష్యాన్ని ఉగాది నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16,702 ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల బిల్లుల నమోదు చేయాలని సూచించారు.