కృష్ణా: విజయవాడలోని కలెక్టరేట్లో ఈనెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం తెలిపారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమంలో అర్జీని అందజేసినట్లయితే గడువు లోగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.