ATP: గుత్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారి జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయం నుండి అమ్మవారి ఆలయం వరకు 108 మంది మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి కలశములతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు.