ప్రకాశం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కనిగిరి డిపో నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసి బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ నయాన తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలోని శైవక్షేత్రాలైన పునుగోడు, చంద్రశేఖరపురంలోని మిట్టపాలెం నారాయణస్వామి, భైరవకోన క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. 26న శివరాత్రి రోజున ప్రతి 15 నిమిషాలకు బస్సు అందుబాటులో ఉంటుందన్నారు.