KKD: జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశాన్ని ఈనెల 18న మధ్యాహ్నం 1:30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు.