PLD: ఎడ్లపాడులోని జాతీయ రహదారిపై సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఎం నాయకులు పీటర్, హరిబాబు, సుబ్బారావులు మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి తమ ఆందోళన తెలిపారు. కూటమి ప్రభుత్వ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తు చేశారు.