అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్గా పాసర్లపూడికి చెందిన సానబోయిన సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ పసుపులేటి మహాలక్ష్మి రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సత్యనారాయణ తెలిపారు.