ప్రకాశం: ప్రజలకు అవసరమైన సేవలను గ్రామస్థాయిలోనే అందించేందుకు గ్రామ సభలను నిర్వహించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 22వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉపాధి హామీ పథకం, కొత్త జాబ్ కార్డు కోసం, పని కోసం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.