ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటుతోపాటు గర్భిణీ స్త్రీలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గుత్తి టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి సూపరిండెంట్ ఎల్లప్పతో కలిసి భోజనాలను అందజేశారు.