SKLM: బూర్జ మండలం డొంకలపర్త సచివాలయ పరిధిలోని హరిపురం, పల్లాపురంలో కాలువల్లో పేరుకుపోయిన పూడికలును ఇవాళ తొలగించారు. ఈ కార్యక్రమం పంచాయతీ సెక్రెటరీ మురళీ ఆధ్వర్యంలో జరిగింది. పరిసరాలను పరిశుభ్రతతో ప్రజలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉందని మురళీ అన్నారు. వర్షకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ఉన్నారు.