SKLM: నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు చిన్నికృష్ణ ఆధ్వర్యంలో శనివారం అడ్మిషన్ డ్రైవ్ చేపట్టారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలు కలిగిన విద్య అందుతుందని చెప్పారు.