ATP: పామిడి సాగునీటి సంఘం ఛైర్మన్గా ఎన్నికైన ఓబులాపురం వెంకటేష్ సోమవారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. నూతన ఛైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.