AKP: రోలుగుంట మండలంలో ఉన్న నల్లరాయి క్వారీల నుంచి అధిక బరువుతో వాహనాలు తిరగడం వల్ల ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సుమారు 50 టన్నుల బరువుతో ప్రతిరోజు వాహనాలు తిరుగుతున్న మైనింగ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.