NLR: మనుబోలు మండల రైతులను అకాల వర్షం నిండా ముంచింది. శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. గాలులు వీయడంతో భారీ వృక్షాలు పడిపోయాయి. ఇదే సమయంలో రైతుల పొలంలో వందలాది ఎకరాలలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. అసలే ధరలు లేవని అల్లాడుతున్న రైతులకు అకాల వర్షంతో మరింత దెబ్బతిన్నారు.