ప్రకాశం: అమరావతిలో సెక్రటేరియట్ నందు శుక్రవారం విదేశీ పెట్టుబడిదారులతో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వాకం వలన విదేశీ పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇన్వెస్టర్స్కు కేరాఫ్ అడ్రస్గా ఏపీని నిలుపుతామని మంత్రి చెప్పారు.