NLR: కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్ర(KVC)లో గురువారం SCసబ్ ప్లాన్ క్రింద మహిళా రైతులకు కూరగాయల విత్తనాలను, గొర్రెల దాణాను ఉచితంగా పంపిణీ చేశారు. రాజమండ్రిలోని జాతీయ వాణిజ్య పంటల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్ గురువారం కందుకూరు KVCని పరిశీలించిన సందర్భంగా ఆయన చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.