VZM: విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం 51 రకాల నైవేద్యాలతో మహా గౌరి అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ అర్చకులు సోమశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి, ఈవోలు పద్మావతీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.