NDL: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రానికి కార్తీకమాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 33 రోజులకు రూ.7,27,26,400 నగదు 117 గ్రా. బంగారం, 7 కిలోల వెండి విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే రూ. కోటి 30 లక్షలు అధికంగా ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. కార్తీకమాసంలో హుండీ ఆదాయం ఈ స్థాయిలో రావడం ఇదే మొదటిసారి ఉన్నారు.