PPM: సాహితీ వేత్తలకు పుట్టినిల్లు మన్యం జిల్లా అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కవులు, సాహితీవేత్తలు, రచయితలు ఉండటం గర్వ కారణమన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, సాంస్కృతిక శాఖ, గ్రంథాలయ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తక మహోత్సవాన్ని పార్వతీపురం GJ కాలేజీ గ్రౌండ్లో ప్రారంభించారు.