PPM: పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే గొప్ప మహనీయులని మాజీ ఎమ్మెల్యే అలజింగి జోగారవు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించి రాష్ట్రాన్ని సాధించారన్నారు.