KRNL: వెల్దుర్తిలోని రైతుల పొలాల్లో 12 డీజల్ మోటర్లు దొంగతనానికి గురయ్యాయి. దీంతో రైతులు నిఘా ఏర్పాటు చేయగా నార్లపురానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు పొలంలో మోటార్ తీగలు కత్తిరిస్తున్న ఓ దొంగను రైతులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. కాగా, పట్టుకున్న వ్యక్తిని ఆటోతో సహా వెల్దుర్తి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.