VZM: జిల్లాలో అర్హులైన అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన SYM, NPS పథకాలను వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ పథకాలకు జిల్లాలో 9,300 మంది నుంచి దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ మేరకు మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.