కృష్ణా: మచిలీపట్నంలో శుక్రవారం రాత్రి బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్టు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కాళ్లు, చేతులు కట్టి గంజాయి మత్తులో గ్యాంగ్ రేప్ చేశారనేది అబద్ధం అన్నారు.