KRNL: మండలంలోని నేరనికి తండా, ఇతర గ్రామాలలో ఆదివారం ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై పోలీసు దాడులు నిర్వహించారు. ఎస్సై మహబూబ్ బాషా, హోళగుంద ఏస్సై దిలీప్ కుమార్ తమ సిబ్బందితో కలిసి కొండ ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ దాడులలో 20 లీటర్ల నాటుసారా, 400 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు.