కోనసీమ: రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలను కోల్పోతే పరిహారం పొందేందుకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఆయన ఇన్సూరెన్స్ స్కీమ్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా ఇన్సూరెన్స్ కంపెనీకి రైతులు ఎకరానికి రూ.630 చెల్లించడం ద్వార రూ.42 వేల వరకు భీమా పొందవచ్చన్నారు.