KDP: కొండాపురం మండలంలోని చామలూరులో భూ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ సి గురప్ప తెలిపారు. గ్రామస్థాయి భూతగాదాలు రీసర్వే అవకతవకలు, భూ సమస్యలు ఉన్నవారు తమ దృష్టికి అర్జీల రూపంలో తీసుకురావాలని తహశీల్దార్ కోరారు. ఈ సదస్సును గ్రామ కమ్యూనిటీ హాలులో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.