NLR: కొడవలూరు మండలంలోని దామేయ గుంట, వెంకన్నపురం గ్రామాల్లో శుక్రవారం అధికారులు రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ పరంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. రెవిన్యూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి స్ఫూర్తి, తదితరులు పాల్గొన్నారు.