GNTR: పొన్నూరు సమీపంలోని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం 30పడకలున్న ఆసుపత్రికి మరో రెండు అంతస్తులు నిర్మించనున్నారు. బెడ్లు సరిపోక రోగులను గుంటూరు, తెనాలికి పంపాల్సిన పరిస్థితి తొలగనుంది. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు