ప్రకాశం: రాచర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ సిబ్బంది బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరిస్తానని చెప్పారు.