కోనసీమ: ప్రజా సమస్యలకు పరిష్కారం చూపటమే ప్రజా దర్బార్ కార్యక్రమం లక్ష్యమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఆయన అమలాపురంలోని క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఆయన అధికారులకు వివరించి వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు.