NLR: నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి స్కూలు విశ్రాంత హెచ్ఎం వనజపై విచారణకు డీఈఓ బాలాజీరావు ఆదేశించారు. విచారణ అధికారిగా నెల్లూరు ఎంఈఓ తిరుపాలును నియమించారు. వనజపై పలు అభియోగాలతో సురేంద్ర రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ జరిపి ఈ నెల 31వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని డీఈఓ ఆదేశించారు.