E.G: ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.