సత్యసాయి: ఓడీసీ మండలం కొండకమర్లలో వారం రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ హాజరయ్యారు. విజేతగా నిలిచిన జట్టుకు ఆయన తన వంతుగా రూ. 5 వేల నగదు బహుమతి అందజేశారు.