VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం ఎల్.కోట తహసీల్దారు ఆద్వర్యంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆస్తుల రక్షణ ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, గ్రామంలో భూ తగాదాలు, రీసర్వేలో జరిగిన తప్పులు ఈ సదస్సులో పరిష్కార మార్గాలు చూపుతారని తెలిపారు. వచ్చే నెల 8 వరకు ఈ సదస్సులు నిర్వహిస్తారన్నారు.