కృష్ణా: రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచటమే ప్రభుత్వ లక్ష్యం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో బస్ షెల్టర్ వద్ధ ఉన్న పంచాయతీ చెరువు వద్ధ భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ జల ధార కార్యక్రమం ద్వారా వంద రోజుల ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు.