GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈ నెల 20 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈ నెల 21వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్లో చూడొచ్చని తెలిపారు.