CTR: కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈగల్ క్లబ్, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ విజయులు రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికులతో కలిసి మత్తు పదార్థాల నివారణలో భాగస్వాములు అవుతామని ప్రిన్సిపల్ ప్రతిజ్ఞ చేయించారు.