NLR: కర్నూలులో నిన్న జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.