తూ.గో జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పండుగ 4 రోజుల్లో రూ. 17.20 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 25,755 బీరు కేసులు, 14,072 మద్యం కేసులు అమ్ముడయ్యాయన్నారు. జనవరి 1 – 13 వరకు 30,345 బీరు కేసులు అమ్ముడవగా.. పండగ 4 రోజుల్లోనే 25,755 కేసుల విక్రయాలు జరిగినట్లు వివరించారు.