సత్యసాయి: హిందూపురంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. నిందితులందరిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు.