NLR: ఏపీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి బుధవారం రాపూరు మండలంలో పర్యటించారు. మండలంలోని బొజ్జలపల్లి గ్రామంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి సందర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆలోచన మేరకు ఇలాంటి ప్లాంట్ను మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు.