శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఉదయం 6, 7, 8 మధ్యాహ్నం 9, 10 తరగతులకు నిర్వహిస్తారు.