E.G: సమాజ సేవలో విశేష కృషి చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఉత్తమ మార్గదర్శి అవార్డు’ ప్రదానం చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది. ఈ మేరకు పీ-4 కార్యక్రమం ద్వారా పేదలకు సేవలందిస్తున్న ఆయన, ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.