TPT: తిరుపతిలో నిన్న రాత్రి రీల్స్ మత్తు వల్ల 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. అలిపిరి పీఎస్ పరిధి రాజారెడ్డినగర్, సాయి నివాస్ అపార్ట్మెంట్లో నేపాల్కు చెందిన ధనుబహదూర్ వాచ్మెన్గా పని చేస్తున్నాడు. అతడి కుమార్తె పుప్పు ఐదో అంతస్తులో రీల్స్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. ఎస్సై శ్రీవాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.