Vishnu Saravanan : ఆసియా క్రీడల కాంస్య పతక విజేత విష్ణు శరవణన్ బుధవారం ఇక్కడ జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ద్వారా పారిస్ గేమ్స్లో చోటు దక్కించుకున్నారు. దీంతో వరుసగా రెండు ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ సెయిలర్గా నిలిచాడు.
ముంబైకి చెందిన ఆర్మీ సెయిలింగ్ నోడ్లో సుబేదార్ అయిన 24 ఏళ్ల శరవణన్ ఇక్కడ జరిగిన ILCA-సెవెన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న 152 మందిలో 26వ స్థానంలో నిలిచి పారిస్ గేమ్స్కు అర్హత సాధించాడు. పారిస్ 2024 గేమ్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ సెయిలింగ్ అథ్లెట్.
ఆసియా దేశాల ఆటగాళ్లలో శరవణన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేత సింగపూర్ ప్లేయర్ను ఓడించాడు. శరవణన్ మొత్తం స్కోరు 174. ప్రామాణిక నిబంధనల ప్రకారం, అతని కనిష్ట స్కోరు 49 తీసివేయబడింది, అతని నెట్ స్కోరు 125 వద్ద ఉంది. విష్ణు 2019 అండర్-21 ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతక విజేత.