పీలేరులో టీడీపీ రా.. కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు.
Chandrababu: పీలేరులో టీడీపీ రా.. కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. ప్రస్తుతం ఆయనకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని.. ప్రజలు కసినంతా ఎన్నికల సమయంలో జగన్పై చూపించాలన్నారు. వచ్చే కురుక్షేత్ర యుద్ధానికి మేం అంతా సిద్ధంగా ఉన్నాం. ఈ యుద్ధంలో గెలుపు టీడీపీ, జనసేనదే.
ఎన్నికల తర్వాత పాకిస్థాన్ జెండా పీకేయడం మాత్రం పక్కా. జగన్ రాయలసీమ ద్రోహి. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత టీడీపీదే అని చంద్రబాబు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటేనే రాయలసీమ సస్యశ్యామలమవుతుంది. జగన్ అబద్ధాలే చెబుతారు. అందులో జగన్ పీహెచ్డీ చేశారన్నారు. జగన్ ఇచ్చిన దానికంటే దోచుకోవడమే ఎక్కువగా ఉందన్నారు. ఇలాంటి జలగ మనకు అవసరమా? అని చంద్రబాబు జగన్పై మండిపడ్డారు.