JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ మహిళా సమైక్య భవనానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మహిళా సాధికారతకు భవన నిర్మాణాలు దోహదపడతాయని పేర్కొన్నారు.