ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘అసురగురువు శుక్రాచార్యుడు’గా నటిస్తున్నాడు. ఇవాళ అక్షయ్ ఖన్నా పుట్టినరోజు కావడంతో.. ప్రశాంత్ వర్మ సెట్స్లోని ఫొటోను షేర్ చేస్తూ విషెష్ తెలిపాడు. అక్షయ్ వంటి నటుడితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే అక్షయ్ తన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.