కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఏలూరు జిల్లాలోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసు బాబు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.