MNCL: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు CPI (ML) న్యూడెమోక్రసీ కోల్ బెల్ట్ కార్యదర్శి బ్రహ్మానందం తెలిపారు. రామకృష్ణాపూర్లో సోమవారం సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, మేధావులు, న్యూడెమోక్రసీ కార్యకర్తలు సదస్సులో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలన్నారు.